తెలంగాణలోని జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో ‘కారు’ దూసుకెళ్లింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నల్గొండ జెడ్పీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కోరం లేక రంగారెడ్డి జిల్లా జిల్లాపరిషత్ ఛైర్మన్ వాయిదా పడింది. హైకోర్టు స్టే విధించడంతో ఖమ్మం జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక నిలిచిపోయింది. తీవ్ర ఉత్కంఠ రేపిన వరంగల్ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయింది.