Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీని తెరాసలో విలీనం చేద్ధాం : మోత్కుపల్లి నర్సింహులు

తెలంగాణ ప్రాంతానికి టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలోని టీడీపీని అధికార తెరాస పార్టీలో విలీనం చేద్దామని సలహా ఇచ్చారు.

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (08:59 IST)
తెలంగాణ ప్రాంతానికి టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలోని టీడీపీని అధికార తెరాస పార్టీలో విలీనం చేద్దామని సలహా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అంతరించి పోతోందని అని చెప్పుకోవడం కంటే అధికార తెరాసలో కలిపేస్తే మంచిదన్నారు. తెరాసలో విలీనం చేస్తే ఎన్టీఆర్‌ ఆత్మ కూడా శాంతిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
టీడీపీ వ్యవస్థాపకుడు, ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు గురువారం జరిగాయి. ఈ సందర్భంగా మోత్కుపల్లి ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'చంద్రబాబుకు ఎన్ని పనులున్నా.. ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చి నివాళులర్పిస్తే బాగుండేదన్నారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందనీ, పార్టీ ప్రాభవం కోల్పోతోందని అందరూ అంటుంటే మానసికక్షోభ కలుగుతోందన్నారు. 
 
భుజాన వేసుకుందామనుకున్నా సహకరించేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మన దగ్గర్నుంచి వెళ్లిన నాయకుడే. చాలా మంది మంత్రులూ టీడీపీ నుంచి వెళ్లినవారే. ఈ పరిస్థితుల్లో పార్టీని తెరాసలో విలీనం చేస్తే ఎన్టీఆర్‌ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. పార్టీ అంతరించిపోయిందనే అవమానం కంటే ఒక మిత్రుడికి సాయం చేయడమే గౌరవంగా ఉంటుంది. చంద్రబాబుకు వ్యక్తిగతంగా సలహా ఇస్తున్నా. ఆయన అర్థం చేసుకోవాలని కోరుతున్నా' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments