Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీని తెరాసలో విలీనం చేద్ధాం : మోత్కుపల్లి నర్సింహులు

తెలంగాణ ప్రాంతానికి టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలోని టీడీపీని అధికార తెరాస పార్టీలో విలీనం చేద్దామని సలహా ఇచ్చారు.

Webdunia
శుక్రవారం, 19 జనవరి 2018 (08:59 IST)
తెలంగాణ ప్రాంతానికి టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలోని టీడీపీని అధికార తెరాస పార్టీలో విలీనం చేద్దామని సలహా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అంతరించి పోతోందని అని చెప్పుకోవడం కంటే అధికార తెరాసలో కలిపేస్తే మంచిదన్నారు. తెరాసలో విలీనం చేస్తే ఎన్టీఆర్‌ ఆత్మ కూడా శాంతిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
టీడీపీ వ్యవస్థాపకుడు, ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు గురువారం జరిగాయి. ఈ సందర్భంగా మోత్కుపల్లి ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'చంద్రబాబుకు ఎన్ని పనులున్నా.. ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చి నివాళులర్పిస్తే బాగుండేదన్నారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందనీ, పార్టీ ప్రాభవం కోల్పోతోందని అందరూ అంటుంటే మానసికక్షోభ కలుగుతోందన్నారు. 
 
భుజాన వేసుకుందామనుకున్నా సహకరించేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ మన దగ్గర్నుంచి వెళ్లిన నాయకుడే. చాలా మంది మంత్రులూ టీడీపీ నుంచి వెళ్లినవారే. ఈ పరిస్థితుల్లో పార్టీని తెరాసలో విలీనం చేస్తే ఎన్టీఆర్‌ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. పార్టీ అంతరించిపోయిందనే అవమానం కంటే ఒక మిత్రుడికి సాయం చేయడమే గౌరవంగా ఉంటుంది. చంద్రబాబుకు వ్యక్తిగతంగా సలహా ఇస్తున్నా. ఆయన అర్థం చేసుకోవాలని కోరుతున్నా' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments