తెలంగాణాలో నేటి నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ

Webdunia
బుధవారం, 28 జులై 2021 (10:05 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభంకానుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో జీవాల పంపిణీకి పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీకారం చుట్టనున్నారు. ఇతర జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు నేతృత్వంలో లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ ప్రక్రియ ప్రారంభంకానుంది. 
 
రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 81 వేల మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. కరోనా కారణంగా రాష్ట్రంలో నిలిచిపోయిన రెండో విడత గొర్రెల పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ముఖ్యమంత్రి ఆదేశాల బుధవారం నుంచి జీవాల పంపిణీ ప్రక్రియ ప్రారంభంకానుంది. 
 
ఇందుకోసం ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేతుల మీదుగా గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభంకానుంది. 
 
రెండో విడతలో రాష్ట్రంలో 3 లక్షల 81 వేల మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ 6 వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఒక గొర్రెల యూనిట్ ధర గతంలో లక్షా 25 వేల రూపాయలుండగా... పెరిగిన ధరలు, లబ్ధిదారుల విజ్ఞప్తుల మేరకు దానిని లక్షాల 75 వేలకు పెంచారు. 
 
సుమారు 6 వేల కోట్లు వెచ్చించి... రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8వేల 109 సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న 7లక్షల 61వేల 898 మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments