Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాసకు షాకిచ్చిన ఎస్ఈసీ : హైదరాబాద్‌లో వరద సాయం పంపిణీకి బ్రేక్!

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (16:19 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారికి వరద సాయం పంపిణీ చేసేందుకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి రావడంతో వరద సాయం పంపిణీతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా నిలిపేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ సెక్రటరీ ఎం.అశోక్ కుమార్‌‌ ఉత్తర్వులను జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వరద సాయాన్ని ఆపేయాలని, ఎన్నికల తర్వాత యధావిధిగా వరద సాయాన్ని కొనసాగించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో వరద సాయానికి బ్రేక్ పడినట్లైంది. 
 
కాగా, ఇటీవల గత వందేళ్లలో ఎన్నడూలేని విధంగా భారీ వరదలు నగరాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. నగరంలో కురిసిన భారీ వర్షానికి నగర వాసులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల కాలనీలన్నీ మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయారు. దీన్ని గమనంలోకి తీసుకున్న కేసీఆర్ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ సహాయంగా బాధితులకు పది వేల రూపాయల చొప్పున అందించాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఇందుకోసం సీఎం కేసీఆర్ రూ.550 కోట్ల నిధులను కేటాయించారు. అయితే... ఈ పంపిణీలో భారీగా అవినీతి జరిగిందని, లబ్ధిదారులకు దక్కకుండా పక్కదారి పట్టాయని తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సర్కార్... దగ్గర్లో ఉన్న మీ సేవ లేదా ఈ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. 
 
దీంతో బాధితులు ఉదయం ఆరు గంటల నుంచే మీసేవా, ఈసేవ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఒక్కసారిగా ప్రజలు ఎగబడటంతో సర్వర్లు కూడా పనిచేయలేదు. ప్రజలు గుమిగూడటం, సర్వర్లు పనిచేయకపోవడం, ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉన్న నేపథ్యంలో వరద సాయాన్ని నిలిపేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments