వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వంద సీట్లు ఖాయం : మంత్రి ఎర్రబెల్లి

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (12:19 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ యేడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీకి వంద సీట్లు ఖాయమని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు. అయితే, ప్రజామద్దతు కోల్పోయిన 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, అయితే పార్టీ విజయానికి ప్రస్తుత ఎమ్మెల్యేల జాబితాలో మార్పులు అవసరమని సీఎం కేసీఆర్ విశ్వసిస్తున్నారని ఎర్రబెల్లి చెప్పారు. గతంలో తాను నిర్వహించిన సర్వేలు కూడా ఎన్నడూ విఫలం కాలేదని మంత్రి దయాకర్ రావు తెలిపారు.
 
ఈ యేడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు, బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై దృష్టి సారించడంతో తెలంగాణలో కూడా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments