Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోన్ యాప్ సిబ్బంది వేధింపులు... ఇంట్లోనే ఉరేసుకున్న బాధితుడు

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (13:20 IST)
తెలంగాణ రాష్ట్రంలో లోన్ యాప్ సిబ్బంది వేధింపులకు మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తన ఇంట్లోని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అదీకూడా పండగనాడే ఇంట్లో ఉరేసుకుని తనవు చాలించాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కొత్తకోటలో జరిగింది. 
 
కొత్తకోటకు చెందిన శేఖర్ అనే యువకుడు గత కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ముఖ్యంగా అత్యవసరంగా డబ్బులు కావాల్సిరావడంతో లోన్ యాప్‌ను ఆశ్రయించాడు. వారి నుంచి సొమ్ము తీసుకుని వాడుకున్నాడు. అవరం తీరిన తర్వాత వడ్డీ డబ్బులతో కలిపి లోన్ యాప్ సంస్థకు తిరిగి చెల్లించాడు. 
 
తీసుకున్న సొమ్ము మొత్త చెల్లించినా లోన్ యాప్ నిర్వాహకుల నుంచి శేఖర్‌కు వేధింపులు ఆగలేదు కదా మరింతగా ఎక్కువయ్యాయి. వడ్డీల పేరుతో ఇంకా బాకీవుందని వరుసబెట్టి ఫోన్లు, మెసేజ్‌లు ఇస్తూ వేధించారు. బాకీ ఉన్న సొమ్ము మొత్తం తక్షణం చెల్లించని పక్షంలో ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. 
 
దీంతో వాళ్లు అడిగిన సొమ్ము చెల్లించేందుకు శేఖర్ సిద్ధపడ్డాడు. డబ్బుల కోసం ప్రయత్నిస్తుండగానే లోన్ యాప్ నిర్వాహకులు శేఖర్ ఫోటోలు మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపించారు. ఆపై వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. వీటిని చూసి తీవ్ర మనస్తాపానికి లోనైన శేఖర్ సోమవారం ఉదయం ఇంట్లోని తన గదిలో ఉరేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments