Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెను లేపుకెళ్లాడనీ.. యువకుడి తండ్రిని చంపేసిన యువతి కుటుంబ సభ్యులు...

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (09:46 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. తమ కుమార్తెను లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో యువతి తల్లిదండ్రులు యువకుడి తండ్రిపై దాడి చేసి చంపేశాడు. ఈ దారుణం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన‌ప‌ల్లి మండ‌లం స్తంభంప‌ల్లిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన గౌత‌మి అనే యువతిని అదే ప్రాంతానికి చెందిన మ‌హేశ్ అనే యువ‌కుడు కొంత‌కాలంగా ప్రేమిస్తూ వచ్చాడు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిసింది. దీంతో యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. 
 
పైగా, గౌత‌మికి మ‌రో అబ్బాయితో వివాహం చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 28న ఆమెకు నిశ్చితార్థం జరుగగా, 27వ తేదీన‌ మ‌హేశ్ ఆమె తీసుకొని గ్రామం నుంచి పారిపోయాడు. దీంతో గౌత‌మి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 
 
అదే రోజు మ‌హేశ్ తండ్రి తునికి ల‌క్ష్మీనారాయ‌ణ‌(58)పై యువతి తల్లిదండ్రులు దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. ఆయనను క‌రీంన‌గ‌ర్‌లోని ఓ ప్ర‌ైవేటు ఆస్ప‌త్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా స్తంభంప‌ల్లిలో పోలీసులు భారీగా మోహ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments