Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తి ప్రాణాలు తీసిన మటన్ ముక్క.. ఎలా?

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (18:12 IST)
మటన్ ముక్క ఓ వ్యక్తి ప్రాణాలు హరించింది. గొంతులో మటన్ ముక్క ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం, హనుమాన్ ఫారంలో శనివారం ఓ ఇంటి వద్ద వివాహ వేడుక జరిగింది. ఇందులో రమణ గౌడ్ (45) అనే వ్యక్తి భోజనం చేస్తుండగా, అతడి గొంతులో మటన్ ముక్క ఇరుక్కుంది. దీంతో మాటరాక, ఊపిరాడక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
కేవలం మటన్ ముక్క ఇరుక్కోవడమే కాకుండా, గుండెపోటు, గ్యాస్ట్రిక్ సమస్య కూడా మరో కారణమని వైద్యులు చెప్పారు. రమణ గౌడ్ మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. కాగా, గతంలో తెలంగాణాలో ఓ బాలుడి గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments