వ్యక్తి ప్రాణాలు తీసిన మటన్ ముక్క.. ఎలా?

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (18:12 IST)
మటన్ ముక్క ఓ వ్యక్తి ప్రాణాలు హరించింది. గొంతులో మటన్ ముక్క ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం, హనుమాన్ ఫారంలో శనివారం ఓ ఇంటి వద్ద వివాహ వేడుక జరిగింది. ఇందులో రమణ గౌడ్ (45) అనే వ్యక్తి భోజనం చేస్తుండగా, అతడి గొంతులో మటన్ ముక్క ఇరుక్కుంది. దీంతో మాటరాక, ఊపిరాడక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
కేవలం మటన్ ముక్క ఇరుక్కోవడమే కాకుండా, గుండెపోటు, గ్యాస్ట్రిక్ సమస్య కూడా మరో కారణమని వైద్యులు చెప్పారు. రమణ గౌడ్ మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. కాగా, గతంలో తెలంగాణాలో ఓ బాలుడి గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments