Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల్వంచలో విషాదం.. గ్యాస్ లీకై ముగ్గురి సజీవదహనం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (09:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ కావడంతో ఏర్పడిన మంటల వల్ల ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ విషాదం పాత పాల్వంచ తూర్పు బజార్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు బజార్‌కు చెందిన శ్రీలక్ష్మి, మండిగ నాగ రామకృష్ణ అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే, సోమవారం వేకువజామున ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. దీంతో దంపతులతోపాటు ఒక చిన్నారి సజీవదహనమైంది. మరో కుమార్తె తీవ్రంగా గాయపడింది. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు 80 శాతం మేరకు శరీరం కాలిపోవడంతో ఆమె పరిస్థితి కూడా విషమంగా మారింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments