సమ్మె విరమించిన జూడాలు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడంతో..?

Webdunia
గురువారం, 27 మే 2021 (20:16 IST)
తెలంగాణలో జూడాలు సమ్మె విరమించారు. తెలంగాణలో సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లు వెనక్కి తగ్గారు. సీఎం కేసీఆర్ తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించడంతో తాము సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. 
 
తెలంగాణలో సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి డిమాండ్లలో కీలకమైన వాటికి పచ్చజెండా ఊపింది. స్టైఫండ్‌ను 15 శాతం పెంచాలన్న జూనియర్ డాక్టర్ల డిమాండ్‌కు సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
 
సీనియర్ రెసిడెంట్లకు రూ. 70 వేల నుంచి 80,500 వరకు పెంచింది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచే అమలవుతాయని పేర్కొంది. ఇక తాము, తమ కుటుంబసభ్యులు కరోనా బారిన పడితే నిమ్స్‌లో చికిత్స అందించాలన్న జూడాల డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 
 
వారి కోసం నిమ్స్‌లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇక కరోనాతో జూడాలు మరణిస్తే వారికి అందించే ఎక్స్‌గ్రేషియా విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santosh Shobhan: కపుల్ ఫ్రెండ్లీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ : ధీరజ్ మొగిలినేని

Tanikella Bharani: శివ భక్తితో లీనమై శివోహం పాటలో నటించా : తనికెళ్ల భరణి

జీవితంలో అందరికీ కనెక్ట్ అయ్యే సీన్స్ ఫంకీ లో ఉంటాయి : కె.వి. అనుదీప్

Prabhas: ఫౌజీ షూటింగ్‌పై కీలక అప్డేట్ - ప్రభాస్ రెడీ ఫర్ యాక్షన్ ?

కె.వి. అనుదీప్ కు నాయిక కయాదు లోహర్‌ మధ్య మంచి కెమిస్ట్రీ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి రక్తనాళాల ఆరోగ్యం కీలకం: నిపుణుల ఉద్ఘాటన

గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించే టాబ్లెట్స్ పరగడుపున వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది

Chaddannam: మహిళలు రోజూ చద్దన్నం తీసుకుంటే ఫలితం ఏంటి?

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

తర్వాతి కథనం
Show comments