సమ్మె విరమించిన జూడాలు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడంతో..?

Webdunia
గురువారం, 27 మే 2021 (20:16 IST)
తెలంగాణలో జూడాలు సమ్మె విరమించారు. తెలంగాణలో సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లు వెనక్కి తగ్గారు. సీఎం కేసీఆర్ తమ డిమాండ్ల పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించడంతో తాము సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. 
 
తెలంగాణలో సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి డిమాండ్లలో కీలకమైన వాటికి పచ్చజెండా ఊపింది. స్టైఫండ్‌ను 15 శాతం పెంచాలన్న జూనియర్ డాక్టర్ల డిమాండ్‌కు సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
 
సీనియర్ రెసిడెంట్లకు రూ. 70 వేల నుంచి 80,500 వరకు పెంచింది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచే అమలవుతాయని పేర్కొంది. ఇక తాము, తమ కుటుంబసభ్యులు కరోనా బారిన పడితే నిమ్స్‌లో చికిత్స అందించాలన్న జూడాల డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 
 
వారి కోసం నిమ్స్‌లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇక కరోనాతో జూడాలు మరణిస్తే వారికి అందించే ఎక్స్‌గ్రేషియా విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

Ram Charan: పెద్ది డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

Niharika Konidela: రాకాస తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం : నిహారిక కొణిదెల

సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. అల్లు వారింటికి విరోష్ దంపతులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments