Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనీరులో మత్తుపదార్థం కలిపి.. పనిమనిషిపై బలాత్కారం చేశారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (15:28 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో దారుణం జరిగింది. చుట్టపు చూపుగా వచ్చిన కొందరు బంధువులు ఆ ఇంట్లో పని చేస్తున్న పనిమనిషిపై అత్యాచారానికి తెగబడ్డారు. టీ లో మత్తుమందు కలిపి లైంగికదాడికి పాల్పడ్డారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఓ మహిళ ఇంట్లో ఓ మహిళ పాచిపని చేస్తూ వస్తోంది. ఈ నెల 13న ఆమె ఇంటికి కొందరు బంధువులు వచ్చారు. అయితే, వారికి ఆ ఇంట్లో పనిచేసే పనిమనిషిపై కన్నుపడింది. 
 
దీంతో, ఇంటి యజమాని సాయంతో టీలో మత్తు కలిపి బంధువుల్లో ఒకడైన సయ్యద్ హుస్సేన్ అనే వ్యక్తి పనిమనిషిపై అత్యాచారం చేశాడు. దారుణం ఏమిటంటే, ఇంటి యజమాని ఆ దారుణాన్ని వీడియో తీసింది.
 
దీని తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ పనిమనిషిని బెదిరించింది. డబ్బు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించింది. దీంతో పనిమనిషి పోలీసులను ఆశ్రయించింది.
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సయ్యద్ హుస్సేన్ ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఇంటి యజమాని కళావతి గతంలో కూడా ఓ వ్యాపారిని ఇలాగే ట్రాప్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments