Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీహెచ్ఎంసీ ఉందా? లేదా? కుక్కలదాడి ఘటనపై హైకోర్టు ప్రశ్నలు

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (08:17 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృత్యువాతపడగా, దీనిపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల ఆధారంగా తెలంగాణ హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గ్రేటర్ హైదరాబాద్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‍ కమిషనర్‌లకు నోటీసులు జారీచేసింది. హైదరాబాద్ నగరంలో కుక్కల బెడద పెరిగిపోతుంటే జీహెచ్ఎంసీ ఏం చేస్తుందని, అస్సలు ఉందా లేదా అని నిలదీసింది. మరోవైపు, వీధి కుక్కల బెడద, కుక్కకాటు నివారణ కోసం పురపాలక శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో ఆదివారం కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ కేసును హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. వీధి కుక్కలు అంశంలో జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఈ ఉదంతంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. వివరణ ఇవ్వాలంటా జీహెచ్ఎంసీ, సీఎస్, అంబర్‍పేట్ మున్సిపల్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు నోటీసు జారీచేసింది. అలాగే, బాలుడి మృతి బాధాకరమని, నష్ట పరిహారం అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచన చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments