Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవాంకా కోసం ప్రత్యేక బహుమతులు.. అన్నీ కరీంనగర్ నుంచే

హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలు విలువ చేసే కానుకలు ఇవ్వనుంది.

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (11:12 IST)
హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలు విలువ చేసే కానుకలు ఇవ్వనుంది. ఇందుకోసం రూ.40 లక్షలు వెచ్చించి కరీంనగర్ ఫిలిగ్రీలో ప్రత్యేక కానుకలు తయారు చేయించింది.
 
మంగళవారం ప్రారంభమైన ఈ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఇక్కడ రూపొందించిన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్టికల్స్‌నే కానుకలుగా ఇచ్చారు. ఇందులో చారిత్రక చార్మినార్, కాకతీయుల కళాతోరణం, జాతీయపక్షి నెమలి, వీణ, హంస జ్ఞాపికలను రూ.40 లక్షల వ్యయంతో ప్రభుత్వం తయారుచేయించింది. వీటినే ఇవాంకాకు కూడా అందజేయనుంది.
 
ఇకపోతే, పారిశ్రామికవేత్తల సదస్సుకు దేశ, విదేశాల నుంచి విచ్చేసిన ప్రతినిధులకు అందజేసేందుకు సీఎం కేసీఆర్ తన అభిరుచికి తగినట్టు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులను తయారు చేయించారు. మూడు కిలోల వెండితో 18 అంగుళాల చార్మినార్‌ను రూ.2.50 లక్షలతో, 4 కిలోల వెండితో 20 అంగుళాల పొడువున కాకతీయ కళాతోరణం, నెమలి, వీణ, హంస జ్ఞాపికలు ఇక్కడ రూపుదిద్దుకున్నాయి. వీటిని ప్రతి అతిథికి ఇవ్వనుంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments