Webdunia - Bharat's app for daily news and videos

Install App

విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయం తగ్గిపోయింది : టి సర్కారు

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (14:19 IST)
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు 14వ ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన చాలా వాణిజ్య సంస్థలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు తరలి వెళుతున్నాయని పేర్కొంది. విభజన తర్వాత వాణిజ్య రంగానికి చెందిన దాదాపు మూడు వేల మంది డీలర్లు తమ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకున్నాయని తెలిపారు. 
 
అంతేకాకుండా, విభజన తర్వాత హైదరాబాద్‌కు రాకపోకలు క్రమంగా తగ్గిపోతున్నాయనీ, దీని ప్రభావం పెట్రోలియం ఉత్పత్తుల మీద, ఇతర అమ్మకాల మీద పడిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో ఆర్థిక సంఘానికి వివరించింది. ఈ రెండు కారణాల వల్ల, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వ్యాట్ పన్నులతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాహన పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా భారీగా తగ్గిందని ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌కు భారీ ఆదాయం వస్తోందన్న ప్రచారం వాస్తవ దూరమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments