Webdunia - Bharat's app for daily news and videos

Install App

26 నుంచి కొత్త రేషన్ కార్డులు : సీఎం కేసీఆర్ నిర్ణయం

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (08:09 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 26వ తేదీ నుచి ఈ కొత్త రేషన్ కార్డుల జారీని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 
 
ఇప్పటికే దరఖాస్తు చేసుకుని కొత్త రేషన్ కార్డుకు అర్హత పొందిన వారికి, ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ చేయాలని వెల్లడించారు. జులై 26 నుంచి 31 వరకు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు దిశానిర్దేశం చేశారు. 
 
దాదాపు 4 లక్షల మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించనున్నారు. కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు ఆగస్టు మాసం నుంచే బియ్యం అందజేయాలని సూచించారు. బియ్యం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌ను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments