Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనిక రాష్ట్రం ఖజానా ఖాళీ... తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్!

దేశంలో రెండో ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడానికి వీల్లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బ

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2016 (10:56 IST)
దేశంలో రెండో ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడానికి వీల్లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. దీనికి కారణం ఆ రాష్ట్ర ఖజానాలో పైసా లేదట. అందుకే చెక్కులను బౌన్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లలేదని మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేవిలా ఉన్నాయి. దీనిపై వివరణ ఇస్తూ, కొత్త జిల్లాలు ఏర్పడిన వేళ, చెక్కులను చెల్లించకుండా తాత్కాలికంగా నిలిపివేశామే తప్ప, అవి చెల్లలేదనడం భావ్యం కాదని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణ డబ్బున్న రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్, చెక్కులు బౌన్స్ కావడంపై ఏమంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మల్లన్న సాగర్ ప్రాంతం నేత బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు. ఓ వైపు వివిధ పథకాలకు నిధులను ఆపవద్దని కేసీఆర్ చెబుతున్న వేళ, చెక్కు బౌన్సుల వ్యవహారం తెరపైకి రావడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments