Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. అలా జరగడం..?

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (18:17 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్.. టి. కాంగ్రెస్ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రగతిభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మరియమ్మ లాకప్‌ డెత్‌‌ ఇష్యూను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరియమ్మ లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. 
 
అలాగే, ఏపీతో నెలకొన్న జల జగడంపైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టీకాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. అపాయింట్‌మెంట్ అయితే, టీకాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. 
 
కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక టీకాంగ్రెస్‌ నేతలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్ లీడర్లు గతంలో ఎన్నోసార్లు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ అవకాశమివ్వలేదు. పైగా అసెంబ్లీలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తులను పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ, ఇప్పుడు వున్నట్టుండి సీఎల్పీ బృందానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments