Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పెచ్చరిల్లిపోతున్న కరోనా కేసులు

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (11:01 IST)
తెలంగాణ కరోనా కేసులు పెచ్చరిల్లిపోతున్నాయి. తెలంగాణలో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,751కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందగా.. మొత్తంగా 637 మంది మృతి చెందారు. 
 
ప్రస్తుతం తెలంగాణలో 22,528 యాక్టివ్ కేసులున్నాయి. 57,586 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 6,24,840 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ 389, రంగారెడ్డి 86, సంగారెడ్డి 84, కరీంనగర్‌ 73 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌లో చోటుచేసుకున్న పెను అగ్నిప్రమాదం అనంతరం కీలక నిర్ణయాలను తీసుకుంది. కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించడానికి తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో కోవిడ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. 
 
కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ఇతర భవన సముదాయాల్లో వాటిని ఏర్పాటు చేశారు. వేలమంది కరోనా వైరస్ పేషెంట్లు వాటిల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 22 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments