Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఉరేసుకుని ఆత్మహత్య.. రెండు గంటల్లోనే భర్త సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సూసైడ్

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (13:14 IST)
తెలంగాణలోని జనగాం పట్టణంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న రెండు గంటల తర్వాత సబ్ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ (55) తన భార్య స్వరూప (50) ఆత్మహత్య చేసుకోవడంతో ఓదార్చేందుకు కొందరు పోలీసు అధికారులు అక్కడికి రావడంతో తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
గురువారం తెల్లవారుజామున స్వరూప బాత్‌రూమ్‌లో కండువాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీనివాస్‌కి మెలకువ వచ్చి బాత్‌రూమ్‌కి వెళ్లి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న బంధువులు, స్నేహితులు ఇంటికి చేరుకున్నారు. 
 
అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ దేవేందర్ రెడ్డి, పట్టణ ఇంచార్జి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగబాబు, ఇతర అధికారులు కూడా ఎస్‌ఐ ఇంటికి చేరుకున్నారు. 
 
ఇంతలో బెడ్ రూంలో వారితో పాటు కూర్చున్న శ్రీనివాస్ వాష్ రూంలోకి వెళ్లాడు. నిమిషాల తర్వాత తుపాకీ శబ్ధం వినిపించింది అధికారులకు. వెంటనే వాష్‌రూమ్‌కు వెళ్లి చూడగా ఎస్‌ఐ శవమై కనిపించాడు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments