Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5.59 కోట్లతో శ్రీవారికి ఆభరణాలు.. తిరుమలకు తొలిసారిగా తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2010లో శ్రీవారికి మొక్కుకున్న కేసీఆర్ తన మొక్కు తీర్చుకోబోతున్నారు. రూ.5.59 కోట్లతో శ్రీవారికి సాలగ్రామహారం, పేటల కంఠాభరణం ఇవ్వబోతున్నారు. ఈ నగల్ని కోయంబత్తూరులో 19 కిలోల

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (13:00 IST)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2010లో శ్రీవారికి మొక్కుకున్న కేసీఆర్ తన మొక్కు తీర్చుకోబోతున్నారు. రూ.5.59 కోట్లతో శ్రీవారికి సాలగ్రామహారం, పేటల కంఠాభరణం ఇవ్వబోతున్నారు. ఈ నగల్ని కోయంబత్తూరులో 19 కిలోల బంగారంతో చేయించారు. ఆభరణాల తయారీ బాధ్యతను టీటీడీకి తెలంగాణ సర్కారు అప్పగించింది. కీర్తిలాల్‌కాళిదాస్‌ కంపెనీ ఈ టెండర్లు దక్కించుకుని ఆభరణాలు తయారు చేసింది. 
 
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉమ్మడి రాష్ట్రంలోని తిరుపతి, కనకదుర్గమ్మ దేవాలయంతో పాటు ఇతర దేవుళ్లు దేవతలకు ముడుపులు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటానని కేసీఆర్ అప్పట్లో తెలిపారు. ఇప్పటికే తెలంగాణలోని దేవుళ్లు, దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.
 
ఈ నెలాఖరు (30)న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి.. బంగారం రూపంలో మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం అటు నుంచే విజయవాడలోని కనక దుర్గమ్మ దర్శనం చేసుకోనున్నారు. అమ్మవారికి ముక్కుపుడక చేయిస్తానని కేసీఆర్ మొక్కుకున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments