Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరె భయ్... వపన్ కల్యాణ్ మన వ్యక్తే.. బాగా చూసుకోండి : కేసీఆర్

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు తనను కలిసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. అంతటితో ఉండిపోకుండా తన పక్కనే ఉన్న పలువురు తెరాస ఎం

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (14:33 IST)
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు తనను కలిసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. అంతటితో ఉండిపోకుండా తన పక్కనే ఉన్న పలువురు తెరాస ఎంపీలకు పవన్‌ను పరిచయం చేశారు. "వపన్ కల్యాణ్ మన వ్యక్తే అని.. ఇకపై పవన్‌ను బాగా చూసుకోండని" అని పార్టీ నేతలకు ఆయన సూచించారు.
 
కాగా, కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లిన పవన్ కళ్యాణ్ దాదాపు 2 గంటల పాటు కేసీఆర్‌తో ఉన్నారు. ఈ సందర్భంగా పవన్‌ను డిన్నర్ చేయాలని కేసీఆర్ కోరడంతో పవన్ అక్కడే భోజనం కూడా చేశారు. భేటీ సమయంలో రాజకీయ అంశాలు, సమస్యలపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. మరోవైపు, పవన్‌ను బాగా చూసుకోవాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 
 
ఈ సందర్భంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న అంశంపై సీఎం కేసీఆర్‌ను పవన్ అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఇంత తక్కువకాలంలో ఇంతటి ఘనత సాధించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. వీరి భేటీలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments