Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఢిల్లీకి టీ సీఎం కేసీఆర్... అందుకోసమే వెళుతున్నారా?

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2015 (09:24 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం హస్తినకు వెళుతున్నారు. మంగళవారం ఢిల్లీలో జరుగనున్న నీతి ఆయోగ్‌ భేటీలో ఆయన పాల్గొంటారు. ఉపసంఘం కన్వీనర్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌‌ ఆహ్వానం మేరకు కేసీఆర్ ఢిల్లీకి వెళుతున్నారు. రాష్ట్రానికి రుణ పరిమితి పెంచాలన్న ప్రతిపాదన కూడా ఈ ఉపసంఘం పరిధిలోనే ఉంది. రేపటి సమావేశంలో ఉపసంఘం నివేదికను ఖరారు చేయనున్నారు.
 
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల సమీక్ష కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సమన్వయకర్తగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతి అయోగ్ ఉప కమిటీ ఏర్పాటైంది. ఇది ఇప్పటికే పలుమార్లు భేటీ అయింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలపై చర్చించింది. అయితే చాలా రాష్ట్రాలు  ప్రభుత్వ పథకాలకు కేంద్రం నిధులను తగ్గించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సమయంలో మంగళవారం జరిగే సమావేశం అత్యంత కీలకంకానుంది. 
 
ఈ సమావేశం తర్వాత ఉప సంఘంలోని ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. నీతి అయోగ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రధానికి వివరించడంతోపాటు నివేదిక సమర్పించనున్నారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేసీఆర్ రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించనున్నారు. ముఖ్యంగా.. డిసెంబర్‌లో తాను నిర్వహించనున్న చండీయాగానికి రావాలని ప్రధానిని ఆహ్వానించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments