Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా ఘటన అమానుషం.. అమరుల కుటుంబానికి రూ.25లక్షలు

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:43 IST)
తెలంగాణ ముఖ్యమంత్రిగా సాధారణ పరిపాలన శాఖతో పాటు ఆర్థిక శాఖ కూడా సీఎం వద్దే ఉండడంతో బడ్జెట్‌ను కేసీఆర్ ప్రవేశపెడుతున్నారు. తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కేబినెట్ ఏర్పాటు ఆలస్యం కావడంతో పద్దుల లెక్కలన్నీ కేసీఆరే చూసుకుంటున్నారు.. దీంతో బడ్జెట్‌ను తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రవేశపెడుతున్నారు. 
 
ఈ బడ్జెట్‌లో భాగంగా ఒక్కో అమరుల కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ వెల్లడించారు. ఈ పాశవిక చర్యను తెలంగాణ అసెంబ్లీ ఖండిస్తోందంటూ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సందర్భంగా సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. 
 
పుల్వామాలో జరిగిన దాడి అమానుషం, హేయమైనదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు ఆయన సంతాపం తెలిపారు. దేశ రక్షణ కోసం 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments