భద్రాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు కూలీల దుర్మరణం

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (13:42 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీని బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చండ్రుగొండు మండలంలోని సుజాత నగర్‌కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డి పల్లి మండలానికి వరినారు తీసేందుకు ఒక బొలెరో వాహనంలో బయలుదేరారు. 
 
ఆ సమయంలో తిప్పనపల్లి వద్ద ఈ వాహనం వెళుతుండగా ఎదురుగా బొగ్గు లోడుతో వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం ముందుభాగం బాగాదెబ్బతిన్నది. దీంతో ముందు భాగంలో కూర్చొన్న కూలీల్లో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఆస్పత్రికి తరలిస్తుండగా, మరో ఇద్దరు మార్గమద్యంలో చనిపోయారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments