Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు కూలీల దుర్మరణం

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (13:42 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీని బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చండ్రుగొండు మండలంలోని సుజాత నగర్‌కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డి పల్లి మండలానికి వరినారు తీసేందుకు ఒక బొలెరో వాహనంలో బయలుదేరారు. 
 
ఆ సమయంలో తిప్పనపల్లి వద్ద ఈ వాహనం వెళుతుండగా ఎదురుగా బొగ్గు లోడుతో వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం ముందుభాగం బాగాదెబ్బతిన్నది. దీంతో ముందు భాగంలో కూర్చొన్న కూలీల్లో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఆస్పత్రికి తరలిస్తుండగా, మరో ఇద్దరు మార్గమద్యంలో చనిపోయారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments