Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. జగిత్యాల ఫస్ట్ - హైదరాబాద్ లాస్ట్

Webdunia
సోమవారం, 13 మే 2019 (12:39 IST)
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం సచివాలయం డీబ్లాక్‌ సమావేశ మందిరంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దనన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా 4374 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. 98.78 శాతం ఉత్తీర్ణతతో బీసీ గురుకుల పాఠశాలలు అత్యుత్తమంగా నిలిచాయి.
 
జూన్‌ 10 నుంచి 24 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. పరీక్ష రుసుం చెల్లించేందుకు మే 27వ తేదీ తుది గడువు అని వెల్లడించారు.

ఇటీవల ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో పదో తరగతి ఫలితాల విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాలు 13వ తేదీ విడుదలయ్యాయి. 
 
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.68 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 91.18గా ఉంది. ఇక 99.30 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక చివరిస్థానంలో 89.09 శాతంతో హైదరాబాద్‌ నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments