Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. జగిత్యాల ఫస్ట్ - హైదరాబాద్ లాస్ట్

Webdunia
సోమవారం, 13 మే 2019 (12:39 IST)
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం సచివాలయం డీబ్లాక్‌ సమావేశ మందిరంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దనన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా 4374 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. 98.78 శాతం ఉత్తీర్ణతతో బీసీ గురుకుల పాఠశాలలు అత్యుత్తమంగా నిలిచాయి.
 
జూన్‌ 10 నుంచి 24 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. పరీక్ష రుసుం చెల్లించేందుకు మే 27వ తేదీ తుది గడువు అని వెల్లడించారు.

ఇటీవల ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో పదో తరగతి ఫలితాల విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాలు 13వ తేదీ విడుదలయ్యాయి. 
 
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.68 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 91.18గా ఉంది. ఇక 99.30 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక చివరిస్థానంలో 89.09 శాతంతో హైదరాబాద్‌ నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments