Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే పనితీరు భేష్.. జారిపోయిన చెప్పును అప్పగించిన సిబ్బంది...

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (14:57 IST)
ఇటీవలి కాలంలో రైల్వే శాఖ పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు రైల్వే శాఖ అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు. తాజాగా రైలు ఎక్కుతుండగా, జారిపడిపోయిన చెప్పును తిరిగి ప్రయాణికుడికి అప్పగించారు. ఈ ఆసక్తికర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జనగామ జిల్లా చిలుపూరు మండలం, పల్లగుట్టకు చెందిన రాజేష్‌ (25) అనే యువకుడు శనివారం సికింద్రాబాద్‌ వెళ్లడానికి స్టేషన్‌‌ఘణపురం రైల్వేస్టేషన్‌కు వచ్చారు. కదులుతున్న రైలు ఎక్కుతుండగా తన కాలికి ఉన్న ఒక చెప్పు జారి రైలు పట్టాల మధ్యలో పడింది. 
 
'చెప్పులు కొత్తవి. నాకు చాలా ఇష్టమైనవని...' అంటూ రైల్వే అధికారులకు ట్వీట్‌ చేశారు. దీంతో సికింద్రాబాద్‌ డివిజనల్‌ భద్రతాధికారి దేబాస్మిత స్పందించి కాజీపేట ఆర్పీఎఫ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ ఆ విద్యార్థి చెప్పును కాజీపేటకు తీసుకువచ్చి ఆదివారం రాజేష్‌కు అప్పగించారు. ఈ వార్త కాస్త వినడానికి కొంత వింతగా ఉన్నా.. చెప్పును కూడా రికవరీ చేయడం పోలీసుల పనితీరుకు అద్దం పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments