Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదీ బిర్యానీపై తాలిబన్ల ప్రభావం.. కారణం అదేనా?

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (14:33 IST)
నోరూరించే హైదరాబాదీ బిర్యానీపై తాలిబన్ల ప్రభావం పడేలా ఉంది. అఫ్ఘాన్‌లో అల్లకల్లోల పరిస్థితుల కారణంగా ఇక్కడి బిర్యానీ ఘుమఘుమలు తగ్గే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే బిర్యానీలో వినియోగించే డ్రై ఫూట్స్‌ను అఫ్గాన్ నుంచి చాలా వరకు దిగుమతి చేసుకుంటారు. అయితే ఇప్పుడా డ్రై ఫ్రూట్స్‌ దిగుమతి ఆగిపోయింది. బిర్యానీకి రుచిని తీసుకురావడంలో డ్రై ఫ్రూట్స్ పాత్ర కూడా కీలకం. 
 
ఎండుద్రాక్ష, ఆల్మండ్‌, అత్తి, జీడిపప్పు, పిస్తాపప్పులను బిర్యానీ తయారీలో వాడుతారు. ఈ డ్రై ఫ్రూట్స్‌లో ఎక్కువ వరకు అఫ్ఘాన్ నుంచే దిగుమతి అవుతున్నాయి. హైదరాబాద్‌లో పేరున్న పెద్ద హోటళ్లు బిర్యానీ తయారీలో సగటున యాభై కేజీల వరకు బాదం పప్పును ఉపయోగిస్తున్నాయి. మిగిలిన డ్రై ఫ్రూట్స్‌ అయిన జీడిపప్పు, కిస్మిస్‌ వినియోగం కూడా ఎక్కువగానే ఉంటోంది. అఫ్గాన్‌లోని ఎగుమతి దారులతో హైదరాబాదీ వ్యాపారులకు ప్రస్తుతం సంబంధాలు లేవు. 
 
తాలిబన్ల పాలనతో మన దగ్గర కూడా డ్రై ఫ్రూట్స్ కొరత ఏర్పడేలా ఉంది. ఇప్పటికే ధరలు భారీగా పెరిగాయ్..! సామాన్యులు భరించలేని స్థితికి ధరలు చేరాయి. భారీగా ధరలు పెరగడంతో డ్రై ఫ్రూట్‌ల వాడకం తగ్గించుకునేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారు. మరోవైపు డ్రైఫ్రూట్స్ ఉపయోగించి చేసే బిర్యానీ వంటకాల రేట్లను పెంచేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments