టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (12:30 IST)
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమాంత్ బిశ్వా శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో హిమంత్‌పై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఒకవేళ కేసు నమోదు చేయకుంటే పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలను ముట్టడించి ధర్నా చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 
 
దీంతో రేవంత్ రెడ్డిని ముందస్తుగా గురువారం అరెస్టు చేశారు. ఆయన్ను నివాసం ముందు పోలీసులు బారికేడ్లు పెట్టి భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద రేవంత్ రెడ్డి ధర్నా చేయనున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత అదుపులోకి తీసుకుని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కావడంతో పాటు టీ పీసీసీ నిరసనలకు పిలుపునివ్వడంతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Eesha Rebha: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Peddi: రామ్ చరణ్ చిత్రం పెద్ది విడుదల వాయిదా వేశారు

Rajasekhar: బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్ పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటన

J. D. Chakravarthy: ప్రచారం కోసం బూతులు మాట్లాడడాన్ని బరాబర్ ఖండిస్తున్నా : జె. డి. చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

తర్వాతి కథనం
Show comments