Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలుశిక్ష కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టు నోటీసులు

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (12:24 IST)
ఓ పరిశ్రమపై దాడి కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కింది కోర్టు విధించిన జైలు శిక్ష వ్యవహారంలో సుప్రీంకోర్టు నోటీసు జారీచేసింది. గత 2014లో ఓ పరిశ్రమపై దాడి కేసులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంగారెడ్డి జిల్లా కోర్టు జైలుశిక్ష విధించింది. ఈ తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈ తీర్పును ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ప్రతివాదులకు కూడా నోటీసులు పంపించింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిక్కుల్లోపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
కాగా, గతంలో పటాన్‌చెరు సమీపంలోని ఓ పరిశ్రమపై దాడి చేసిన కేసులో మహిపాల్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయనకు రెండున్నరేళ్ల జైలుశిక్షతో పాటు 2500 రూపాయల అపరాధం కూడా విధించింది. ఈ తీర్పుపై మహిపాల్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేయగా, స్టే విధించింది. అప్పటి నుంచి ఈ కేసులో స్టే కొనసాగుతూనేవుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

Avika Gor: ప్రియుడు మిలింద్ చంద్వానీతో అవికా గోర్ నిశ్చితార్థం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments