Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా బాధ్యతగా ఉంటే జరిగే మేలు ఇదీ.. ఆ కథనానికి సీఎమ్మే స్పందించారు మరి!

ఒక వైపు మండువేసవి ఏప్రిల్‍‌నెలలోనే వచ్చేసిందా అనేలా మండుతున్న ఎండలు. కానీ విద్యార్థులను చేపలబండకేసి తోముతున్న విద్యా సంస్థలు. వేలాది పిల్లలు స్కూలు బాట పట్టి ఎర్రటి ఎండలో పడుతున్న వ్యధలు.. ఏమీ చేయలేక నిస్సహాయంగా పిల్లలను ఎండల్లోనే స్కూళ్లకు పంపుతున్న

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (03:01 IST)
ఒక వైపు మండువేసవి ఏప్రిల్‍‌నెలలోనే వచ్చేసిందా అనేలా మండుతున్న ఎండలు. కానీ విద్యార్థులను చేపలబండకేసి తోముతున్న విద్యా సంస్థలు. వేలాది పిల్లలు స్కూలు బాట పట్టి ఎర్రటి ఎండలో పడుతున్న వ్యధలు.. ఏమీ చేయలేక నిస్సహాయంగా పిల్లలను ఎండల్లోనే స్కూళ్లకు పంపుతున్న తల్లిదండ్రులు. ఒక తెలుగు దినపత్రిక..విద్యార్థులు పడుతున్న తీవ్ర ఇబ్బందులపై మండుటెండల్లో బాల శిక్ష పేరిట ఒక కథనం ప్రచురించింది. అదేమీ పరిశోధనాత్మక కథనం కాదు. కొన్ని వందల స్కూళ్ల యాజమాన్యాలు పిల్లల క్షేమాన్ని పట్టించుకోకుండా ప్యవహరిస్తున్న వైనాన్ని, ప్రభుత్వం కూడా కనీస సున్నిత స్పందన కూడా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనాన్ని ఆ పత్రిక ఒక వార్తగా మాత్రమే ప్రచురించి పిల్లల బాధలను ప్రపంచం ముందు పెట్టారు. 
 
అంతే... కొన్ని వేలమంది పిల్లల దురవస్థ గురించి ఎవరు స్పందించాలో వారే స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తక్షణమే స్పందించారు. ఎండలతో బయట తిరిగే పరిస్థితి లేదని, విద్యార్థులను బడికి పంపడం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. బుధవారం నుంచే సెలవులు ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు. అయితే అప్పటికే పిల్లలు స్కూళ్లకు వెళ్లడంతో గురువారం నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు.
 
విద్యామంత్రి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం నుంచి పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు మేనేజ్‌మెంట్లకు చెందిన పాఠ«శాలలు అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కిషన్‌ వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లోనూ కొనసాగుతున్న తరగతుల నిర్వహణను నిలిపివేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లాల్లోని డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లు కూడా ఈ ఉత్తర్వులు అమలు చేయాలని విద్యాశాఖ పేర్కొంది. వాస్తవానికి షెడ్యూలు ప్రకారం ఈ నెల 22 పాఠశాలలకు ఆఖరు పనిదినం. 23వ తేదీ నుంచి వేసవి సెలవులుగా విద్యాశాఖ పేర్కొంది. అయితే ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న కష్టాలపై ఆ తెలుగు దినపత్రిక కథనం ప్రచురించడంతో ప్రభుత్వం ముందస్తు సెలవులను ప్రకటించింది. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠినంగా వ్యహరించనున్నట్లు హైదబారాద్‌ జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్‌ చెప్పారు.
 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments