Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం తాగి వాహన ప్రమాదం చేస్తే కఠిన శిక్ష, పదేళ్ల జైలు లేదా యావజ్జీవం: సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (22:54 IST)
అతిగా మద్యం తాగి, మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు పాల్పడితే.. ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుతో సరిపెట్టబోమని, కఠినంగా వ్యవహరిస్తామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. ఇలాంటి వారిపై ఐపీసీ 304-ఎ సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తామని, పదేళ్ల జైలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కోర్టుల్లో సాక్ష్యాధారాలను సమర్పిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
ఇటీవల శంషాబాద్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌ ప్రాంతాలతో పాటు బాహ్యవలయ రహదారులపై మద్యం మత్తులో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. ఈ తరహా ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని, రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ ఈ బృందాలు విధులు నిర్వర్తిస్తాయని తెలిపారు. 
 
మహబూబ్‌నగర్‌, మెదక్‌, సిద్దిపేట, బీదర్‌లతో పాటు హైదరాబాద్‌ శివారుల్లో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌ల్లో మద్యం తాగి మాదాపూర్‌, సైబర్‌ టవర్స్‌, గచ్చిబౌలి ప్రాంతాలకు లాంగ్‌డ్రైవ్‌కు వస్తున్నట్లు గుర్తించామన్నారు. మద్యం మత్తులో వాహనం ఎవరు నడిపినా.. అసలు యజమానిపైనా కేసు నమోదు చేస్తామని సజ్జనార్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సెకండ్ సింగిల్ హే జింగిలి..రాబోతుంది

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments