తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. వెన్నునొప్పితో..?

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (13:52 IST)
తుపాకీతో కాల్చుకొని ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం వెన్నునొప్పి. ఆదివారం సికింద్రాబాద్‌ డివిజన్‌లోని రాణిగంజ్‌ ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం బత్తులపాలెం గ్రామానికి చెందిన మధు (32) 2009లో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. నాటినుంచి తిరుపతిలో పనిచేసి రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు బదిలీ అయ్యాడు. 
 
ఆదివారం మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాణిగంజ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తూ తన ఎస్‌ఎల్‌ఆర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కొంతకాలంగా మధు తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నాడని తెలుస్తోంది. అనారోగ్యం తీవ్రంగా బాధిస్తున్న కారణంగానే మధు ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sprit legal notice: మహిళా రైతు నిర్మాత నర్సమ్మ స్పిరిట్ చిత్రానికి ప్రభాస్ కు సంబంధం ఏమిటి?

Narne Nithin: నార్నే నితిన్ #NN5 మూవీ హ్యూమరస్ క్రియేటివ్ పోస్టర్ ద్వారా అనౌన్స్‌మెంట్

Naga Durga : ప్రియదర్శి మూవీలో హీరోయిన్ గా తెలుగు ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ

Suriya: విశ్వనాథ్ & సన్స్ చిత్రం తొలి గీతం నేనో బటర్‌ఫ్లై

Prabhas: మాటలు లాంటి పాటలతో తీశాం గట్టిగా చెప్పు అంటున్న ప్రభాస్

తర్వాతి కథనం
Show comments