Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప భక్తులకు శుభవార్త - సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (09:40 IST)
తెలుగు రాష్ట్రాల్లోని అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు తెలిపింది. మొత్తం 22 స్పెషల్ ట్రైన్స్‌ను నడుపనున్నట్టు తెలిపింది. ఇవి ఈ నెల 26వ తేదీన, డిసెంబరు 3 తేదీల్లో సికింద్రాబాద్ - కొల్లం ప్రాంతాల మధ్య ప్రత్యేక రైలును నడుపుతారు. అలాగే, ఈ నెల 28వ తేదీ, డిసెంబరు 5 తేదీల్లో కొల్లాం - సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైలును నడుపుతారు. 
 
ఈ నెల 26వ, డిసెంబరు 3 తేదీల్లో నర్సాపూర్ - కొట్టాయం, ఈ నెల 27, డిసెంబరు 4వ తేదీల్ల కొట్టాయం - నర్సాపూర్, ఈ నెల 22, 29వ, డిసెంబరు 6వ తేదీల్లో కాచిగూడ - కొల్లం, ఈ నెల 24, డిసెంబరు 1, 8 తేదీల్లో కొల్లం - కాచిగూడ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. 
 
ఇకపోతే, ఈ నెల 23, 30వ తేదీనల్లో కాకినాడ - కొట్టాయం, ఈ నెల 25, డిసెంబరు 6వ తేదీన కొట్టాయం - కాకినాడు, ఈ నెల 24, డిసెంబరు ఒకటో తేదీన సికింద్రాబాద్ - కొల్లం, ఈ నెల 25, డిసెంబరు 2వ తేదీల్లో కొల్లం - సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయని, ఈ రైళ్లలో ప్రయాణం చేయదలచిన ప్రయాణికుల సౌకర్యార్థం ముందస్తు రిజర్వేషన్ సౌలభ్యం కూడా కల్పించినట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments