తండ్రిని దారుణంగా కొట్టి చంపేసిన కుమారుడు..

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (13:36 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసిన తండ్రిని ఓ తనయుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని కర్రతో, బెల్టుతో విచక్షణ రహితంగా కొడుకు కొట్టడంతో ఆ తండ్రి ప్రాణాలు కోల్పోయారు.
 
వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో 63 సంవత్సరాల సత్యనారాయణ అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పక్షవాతం బారిన పడి మంచానికి పరిమితం అయ్యాడు. 
 
అయితే తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో, తండ్రితో కొడుకు సురేష్ గొడవకు దిగాడు. ఫుల్లుగా మద్యం తాగి వచ్చిన సురేష్ ఈ క్రమంలో కోపంతో ఊగిపోయి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన తండ్రి సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు.
 
ఇక ఈ విషయం స్థానికులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కొడుకును అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments