Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో కాల్పులు.. బీజేపీ నేత అల్లుడి మృతి

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (11:08 IST)
హైదరాబాద్ నగరంలో భయానక సంఘటన ఒకటి జరిగింది. భారతీయ జనతా పార్టీ నేత అమర్‌సింగ్ అల్లడు ఆకాష్ సింగ్ తుపాకీ కాల్పుల్లో మరణించాడు. ఈ కాల్పులు తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్టు వైద్యుులు నిర్ధారించారు. దీంతో కాల్పులు జరిపిన ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు తపచపుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్వాన్ మురిగి సమీపంలో ఆకాష్ సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అదీ కూడా పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరపడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
సమాచారం అందుకున్న తపచపుత్రా పోలీసులు వెంటనే నేరస్థలానికి చేరుకున్నారు. విచారణలో ఆ ప్రదేశంలో తుపాకులు, కత్తులు లభ్యమయ్యాయి. చాలా కాలంగా ఉన్న ఫ్యాక్షన్ గొడవల కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
 
కాల్పుల అనంతరం క్రాంతి, అతని మద్దతుదారులు పారిపోయారని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments