Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర ప్రమాదం, ఆరుగురు స్పాట్ డెడ్

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (14:40 IST)
హైదరాబాదు ఔటరింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. బోలెరో వాహనంలో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు రోడ్డుపై చెల్లాచెదరైపోయాయి. ఇందులో ముగ్గురు తీవ్ర గాయాలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక వివరాల మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాటి గ్రామం వద్ద ఔటర్ రంగ్ రోడ్డుపై ఈ ఘోర ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
 
గుర్తు తెలియని వాహనం ముందున్న వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన కొందరు బోలెరో వాహనంలో హైదరాబాదు నుంచి పటాన్‌చెరువు వైపు ఔటర్ రింగ్ రోడ్డులో వెళ్తున్నారు. వారి వాహనం పాటిగ్రామానికి చేరేసరికి వెనక నుండి అతి వేగంగా వచ్చిన మరో వాహనం బోలెరో వాహనాన్ని డీ కొట్టింది. దీంతో బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో ఉన్న ఆరుగురు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరణించిన ఆరుగురి మృత దేహాలను పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పటాన్ చెరువు ఇన్‌చార్జ్ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఓఆర్ఆర్ పాటిగ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి గురైన బోలెరో వాహనంలో 9 మంది ప్రయాణిస్తుండగా ఈ రోజు తెల్లవారు జామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
 
ముందు వెల్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చెయ్యడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఈ వాహనాన్ని డీకొన్న వాహనం కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మృతుల వివరాలకోసం ఆరా తీస్తున్నామని ఇన్‌చార్జ్ డిఎస్పీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments