హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర ప్రమాదం, ఆరుగురు స్పాట్ డెడ్

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (14:40 IST)
హైదరాబాదు ఔటరింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. బోలెరో వాహనంలో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు రోడ్డుపై చెల్లాచెదరైపోయాయి. ఇందులో ముగ్గురు తీవ్ర గాయాలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక వివరాల మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాటి గ్రామం వద్ద ఔటర్ రంగ్ రోడ్డుపై ఈ ఘోర ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
 
గుర్తు తెలియని వాహనం ముందున్న వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన కొందరు బోలెరో వాహనంలో హైదరాబాదు నుంచి పటాన్‌చెరువు వైపు ఔటర్ రింగ్ రోడ్డులో వెళ్తున్నారు. వారి వాహనం పాటిగ్రామానికి చేరేసరికి వెనక నుండి అతి వేగంగా వచ్చిన మరో వాహనం బోలెరో వాహనాన్ని డీ కొట్టింది. దీంతో బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో ఉన్న ఆరుగురు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరణించిన ఆరుగురి మృత దేహాలను పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పటాన్ చెరువు ఇన్‌చార్జ్ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఓఆర్ఆర్ పాటిగ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి గురైన బోలెరో వాహనంలో 9 మంది ప్రయాణిస్తుండగా ఈ రోజు తెల్లవారు జామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
 
ముందు వెల్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చెయ్యడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఈ వాహనాన్ని డీకొన్న వాహనం కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మృతుల వివరాలకోసం ఆరా తీస్తున్నామని ఇన్‌చార్జ్ డిఎస్పీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

Kiran Abbavaram: K-ర్యాంప్ కలెక్షన్ల కంటే ఆడియెన్స్ నవ్వులే నాకు సంతృప్తి : కిరణ్ అబ్బవరం

Meenakshi: ఎన్.సి.24 చిత్రం నుంచి పరిశోధకరాలిగా మీనాక్షి చౌదరి లుక్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments