సత్తా చాటిన సిద్ధిపేట.. వ్యాక్సినేషన్‌లో ప్రైమ్ మినిస్టర్ అవార్డ్

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (18:49 IST)
సిద్ధిపేట జిల్లా సత్తా చాటింది. చిన్నారులకు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయడం లక్ష్యంలో భాగంగా ప్రారంభించిన మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమం అమలులో సిద్ధిపేట మంచి ఫలితాలను సాధించింది. 
 
దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్ర ధనుష్ కేటగిరీలో సిద్దిపేట జిల్లాను ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ -2019కి ఎంపిక చేసింది. 
 
ఇందులో భాగంగా ఏప్రిల్ 20-21న ఢిల్లీలో జరిగే "సివిల్ సర్వీసెస్ డే" కార్యక్రమంలో ట్రోఫీతో పాటు రు.10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాకు అందిస్తుంది.
 
సిద్దిపేట జిల్లాకు ఈ అవార్డు రావడంపై ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. 
 
రాష్ట్రంలోని ప్ర‌తి చిన్నారికి వంద శాతం వ్యాక్సినేష‌న్ పూర్తి చేసేలా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో వైద్యారోగ్య శాఖ కృషి చేస్తుంద‌ని హరీష్ రావు వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments