తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇక తప్పుకుంటే మంచిదని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి శంకర్ రావు సలహా ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... పొన్నాల అర్జెంటుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ బాధ్యత తాను తీసుకుంటానని పొన్నాల అన్నారని, అందుచేత పొన్నాల పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నట్టు చెప్పారు.
తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యుల మధ్యనే సమన్వయం లేదని, ఇక వీళ్ళు పార్టీలో సమన్వయం ఎలా తెస్తారని శంకర్రావు ప్రశ్నించారు. పొన్నాల పదవిని పీకేసి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం మీద సమర్థుడిని కూర్చోబెట్టాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశానని శంకర్రావు వెల్లడించారు.