Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలైన్ బాటిల్‌లో బ్యాక్టీరియా...చూపును పోగొట్టుకున్న 13 మంది..?

హైదరాబాద్‌లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి వైద్యుల నిర్వాకం వల్ల 13 మందికి కంటిచూపు పోయింది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వైద్యులపై కేసు నమోదైంది. మెహిదీపట్నంలో ఉన్న ఈ ఆసుపత్రిలో గత గురువారం వీరికి కంటి శస

Webdunia
గురువారం, 7 జులై 2016 (08:31 IST)
హైదరాబాద్‌లోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి వైద్యుల నిర్వాకం వల్ల 13 మందికి కంటిచూపు పోయింది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వైద్యులపై కేసు నమోదైంది. మెహిదీపట్నంలో ఉన్న ఈ ఆసుపత్రిలో గత గురువారం వీరికి కంటి శస్త్రచికిత్స చేశారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితుల ఫిర్యాదుపై హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 338 కింద కేసు నమోదు చేశారు. 

కాగా, సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న 13 మంది రోగుల్లో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కళ్లు శుభ్రం చేసేందుకు వాడే సెలైన్ బాటిల్‌లో బ్యాక్టీరియా ఉన్నందువల్లే రోగులు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని విచారణాధికారి డాక్టరు రవీందర్ గౌడ్ పేర్కొన్నారు. ఆపరేషన్ జరిగి అయిదురోజులు కావస్తున్న వారికి కంటి చూపు రాలేదు.... సరికదా ఉన్న చూపు కూడా ఊడగొట్టినట్టయ్యింది.

పరిస్థితి తెలిసి ఆసుపత్రి డిప్యూటీ సూపరిటెండెంట్ రాజేంద్ర గుప్తా విచారణ చేపట్టారు. ఆపరేషన్‌కు ముందు కళ్లను శుభ్రంచేసే సెలైన్ వల్లే ఈ సమస్య ఏర్పడినట్టు గుర్తించారు. వాటిని ప్రభుత్వమే సరఫరా చేస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం తరుపున ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రికి వచ్చి మందులు పరిశీలించి వెళ్లారని తెలిపారు. ప్రభుత్వానికి ఎవరైన మెడిసిన్ సరఫరా చేశారో ఆ ఏజెన్సీదే బాధ్యతని అన్నారు. పరిస్థితి చక్కబడే వరకు వారం రోజుల పాటూ ఆపరేషన్లు ఆపేస్తున్నట్టు చెప్పారు. 13 మందికి చూపు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వైద్యబృందం తెలిపారు. సీఎం కేసీఆర్ దీనిపై విచారణకు ఆదేశించింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ థ్రిల్లర్ గా ది రాజా సాబ్ ఏప్రిల్ 10న రాబోతుందన్న డైరెక్టర్ మారుతి

శివకార్తికేయన్, సాయి పల్లవి చిత్రం అమరన్ లో ఫస్ట్ సింగిల్ లాంఛ్ చేసిన నితిన్

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటున్న నిఖిల్ సిద్ధార్థ్‌, రుక్మిణి వ‌సంత్

క్రిష్ణ ఫ్యామిలీకి చెడ్డపేరు రాకుండా వుండే సినిమాలు చేస్తున్నా : అశోక్ గల్లా

ప్రకాష్ రాజ్ స్వార్దపరుడు.. నిర్మాత నట్టి కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments