Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెదక్ జిల్లాలో కాంగ్రెస్ తొలిజాబితా.. ఏడుగురికి స్థానం

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (19:32 IST)
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో ఎవరెవరు ఉంటారోనని పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా.. నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులపై పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ తొలిజాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 
 
మాజీ ఉపముఖ్యమంత్రి రాజనరసింహ అందోల్ నుంచి, జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి పోటీ చేయడంపై ఎవరికీ సందేహం లేదు. వీరిద్దరూ ఇప్పటికే తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. గత మూడుసార్లు జహీరాబాద్‌లో పోటీ చేసిన గీతారెడ్డి వయసు రీత్యా ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. 
 
వికారాబాద్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎ.చంద్రశేఖర్‌ను మళ్లీ జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలిపించింది. ఇక్కడ టిక్కెట్ కో ఎవరూ పోటీ చేయకపోవడంతో చంద్రశేఖర్ పేరు మొదటి జాబితాలో కచ్చితంగా ఉంటుందని అంటున్నారు.
 
పటాన్ చెరు నియోజకవర్గం నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం కాట వైపే మొగ్గు చూపుతోంది. పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీలో అత్యంత బలమైన క్యాడర్ ఉన్న నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ అని కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు.
 
పార్టీలో సీనియర్ నాయకులు దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డిల మద్దతు కూడా కాటాకు లాభిస్తుంది. తొలి జాబితాలోనే పార్టీ పేరు తప్పకుండా వస్తుందని కాటా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments