Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీమంత్రి ధర్మపురి శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత - సిటీ న్యూరో ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (13:54 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ సోమవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయనకు మూర్ఛ రావడంతో తక్షణం హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని న్యూరో సిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మారై స్కాన్ తదితర పరీక్షలను చేస్తున్నారు. ఈ వైద్య పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఒక మీడియా బులిటెన్ విడుదల చేయనున్నారు. 
 
ఇదిలావుంటే, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అదేసమయంలో ఆయనకు ఢిల్లీలో ఆదరణ తగ్గింది. దీంతో ఆయన తెరాస పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ రాజ్యసభ టిక్కెట్ ఆశ చూపడంతో ఆయన పార్టీలో చేరి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 
 
అయితే, అక్కడ ఆయన ఇమడలేక పోయారు. సొంత పార్టీ నేతలే ఆయన పొగబెట్టారు. దీంతో ఆ పార్టీకి కూడా దూరమై ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు. అయితే, ఆయన తనయుడు ధర్మపురి అరవింద్ మాత్రం తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ తరపున లోక్‌సభ సభ్యుడిగా నిజామాబాద్ స్థానం నుచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments