Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వం నుంచి శశికళకు నోటీసులు... నలిపేసిన శశి

శశికళకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. నాలుగేళ్ళ జైలుశిక్ష అనుభవించేందుకు బెంగుళూరుకు శశికళ బయలుదేరే సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మరో నోటీసు వచ్చింది. సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి, రాధిక కాలనీలో శశికళ పేరిట ఒక ఇల్లు ఉండగా, ఆ ఇంటికి గత రెండేళ్

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (21:46 IST)
శశికళకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. నాలుగేళ్ళ జైలుశిక్ష అనుభవించేందుకు బెంగుళూరుకు శశికళ బయలుదేరే సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మరో నోటీసు వచ్చింది. సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి, రాధిక కాలనీలో శశికళ పేరిట ఒక ఇల్లు ఉండగా, ఆ ఇంటికి గత రెండేళ్ళ నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదు శశికళ. 
 
పన్ను బకాయిలను నూరు శాతం వసూలు చేయాలని సంకల్పించిన కెసీఆర్ సర్కార్ ఈ మేరకు శశికళ పేరిట నోటీసులు కూడా జారీ చేశారు. ఈ ఇంటిని 1990 ప్రాంతంలో శశికళ కొనుగోలు చేశారట. అప్పట్లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కొంతకాలం జయలలిత ఇదే ఇంట్లోనే బస చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ఈ ఇంటిని అద్దెకు ఇచ్చినప్పటి నుంచి వారు ఖాళీ చేసి వెళ్ళిన తరువాత గత నాలుగేళ్ళుగా ఈ ఇల్లు ఖాళీగానే ఉందని స్థానికులు చెబుతున్నారు.
 
శశికళ బెంగుళూరుకు బయలుదేరక ముందే ఆమెకు ఈ నోటీసులు అందాయట. దీంతో ఆమె మరింత ఆవేదన చెందుతూ ఆ నోటీసు నల్లిని నలిపినట్లు నలిపి అక్కడ పడేసి వెళ్లిపోయారట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments