పాపం ఆ ఇద్దరు నేతలు!

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (05:47 IST)
భూపాలపల్లి నుంచి 2014లో గెలుపొందిన మధుసూదనాచారి 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఏ పదవి లేక ఇంటికే పరిమితమయ్యారు.

ఎన్నికల ముందు "ఈ దఫా బరిలోకి దిగవద్దు'' అని మధుసూదనాచారికి సీఎం కేసీఆర్ నచ్చచెప్పారు. "పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే మీకు గౌరవప్రదమైన పదవి కట్టబెడతాం'' అని కేసీఆర్‌ హామీ ఇచ్చినా మధుసూదనాచారి ససేమిరా అన్నారు. దీంతో ఒక మెట్టు దిగిన కేసీఆర్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి చారికి అవకాశం కల్పించారు.

అయితే స్థానికంగా పరిస్థితులు కలిసిరాక మధుసూదనాచారి ఓడిపోయారు. ఈ తరుణంలో ముందుకు వెళ్లలేక.. ఏ పదవి అడగలేక ఆయన మిన్నకుండిపోయారు. కొత్త సంవత్సరంలో తెలంగాణలో ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాల్లో కొన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయి. దీంతో అధినేత ఏదో ఒక పదవి ఇస్తారన్న ఆశతో ఆయన ఎదురుచూస్తున్నట్టు సమాచారం!
 
టీఎన్‌జీవోల నేతగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు స్వామిగౌడ్. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని స్వామిగౌడ్ ఆశించినా ఆ అవకాశం దక్కలేదు. దీంతో పట్టభద్రుల నియోజకవర్గoలో ఎమ్మెల్సీగా బరిలోకి దిగి బంపర్‌ మెజారిటీతో గెలిచారు.

కానీ ఆయన ఆశించినట్టుగా అమాత్యపదవి మాత్రం దక్కలేదు. కానీ సీఎం కేసీఆర్‌ ఆయనను మండలి ఛైర్మన్ పీఠంపై కూర్చోబెట్టారు. తన ఆరేళ్ల పదవీకాలంలో ఎలాంటి వివాదాలు లేకుండా శాసనమండలిని నడిపించారు స్వామిగౌడ్.
 
మండలి ఛైర్మన్ పదవీకాలం ముగియడంతో స్వామిగౌడ్ మరోమారు తనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని భావించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్‌నీ.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నీ కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఆయనకు సానుకూల సంకేతాలు మాత్రం రాలేదు.

అయితే బీజేపీలోకి స్వామిగౌడ్ జంప్‌ చేస్తారంటూ అప్పటికే బాగా ప్రచారం జరిగింది. ఈ కారణంగానే ఆయన కోరుకున్న పదవులు దక్కలేదన్నది పార్టీ వర్గాల టాక్‌! బీజేపీలోకి తాను మారనని స్వామిగౌడ్‌ పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ ఆయనకు కేసీఆర్ దర్శనభాగ్యమే కలగలేదని చెప్పుకుంటున్నారు.

ఇదే సమయంలో తనతోపాటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన శ్రీనివాస్ గౌడ్‌కు మంత్రి పదవి దక్కడంతో స్వామిగౌడ్ సైలెంట్ అయ్యారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments