Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు ఆ విషయం ముందే తెలియదా?: సబితమ్మ సూటి ప్రశ్న

Webdunia
శుక్రవారం, 17 జులై 2015 (17:44 IST)
చాలాకాలం తర్వాత మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీన్లోకి వచ్చారు. వచ్చీ రావడం తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సాగు, తాగునీరు అందించడం కేసీఆర్‌కు ఇష్టం లేనట్టు ఉందని సబితా తెలిపారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ.. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కావాలని డిమాండ్ చేసినప్పుడు కేసీఆర్‍‌కు ఈ ప్రాజెక్టు డిజైన్ సరికాదని తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. 
 
చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడారో అందరికీ తెలుసునన్నారు. చేవెళ్లకు నీరందకుండా డిజైన్ మారిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వాన్ని సబిత హెచ్చరించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును ప్రజలు అంగీకరించట్లేదని, ఒకవేళ ప్లాన్ మార్చాలనుకున్నా.. కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు సబిత దుయ్యబట్టారు. పార్టీలకు మార్కులు ప్రధానం కాదని, ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలు పరిరక్షించాలని సబితమ్మ కేసీఆర్‌కు సూచించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments