Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాంపల్లి అగ్ని ప్రమాదం: రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (10:58 IST)
నాంపల్లి అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అంతకుముందు ఘటనా స్థలాన్ని మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందజేస్తుందని ఆయన ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని, ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగిన వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 
 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రంలోగా మృతుల కుటుంబాలకు పీఎం కేర్స్ సాయం అందజేస్తుందని పేర్కొన్నారు. నాంపల్లిలో జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
హైదరాబాద్ అన్ని రకాల ప్రమాదాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం బాధాకరమని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments