ఆయన ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో విలేకరులతో మాట్లాడుతూ... దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియ్యంగా చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే పాఠశాలలు, వసతిగృహాల్లో బియ్యంపై విజిలెన్స్ దాడులు చేయించాలని డిమాండ్ చేశారు.
వసతి గృహాల్లో బియ్యం నమూనాలు సేకరించి నాణ్యతను పరీక్షించాలన్నారు. సీఎం కుటుంబ సభ్యులెవరైనా వసతిగృహాల్లో భోజనం చేయగలరా? అని సవాల్ చేశారు. అవినీతిని సహించేది లేదని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.