Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి వార్నింగ్ : మేం తలచుకుంటే టి భవన్ ఆనవాళ్లు ఉండవ్!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (18:41 IST)
తెలంగాణాలోని టీడీపీ కార్యకర్తలు తలచుకుంటే హైదరాబాద్‌లో తెలంగాణ భవన్ ఆనవాళ్లు ఉండవని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాగే, నల్గొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి జిల్లా ఎస్పీ ప్రభాకరరావు సహకారంతోనే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిప్పు పెట్టారని ఆయన ఆరోపించారు. 
 
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ ప్రభాకరరావు తీరుపై అసెంబ్లీలో చర్చిస్తామని అన్నారు. ఏం నేరం చేశారని మాధవరెడ్డి చిత్ర పటాన్ని తగులబెట్టారని రేవంత్ రెడ్డి నిలదీశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేయించి టీ. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళుతున్న టీడీపీ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments