Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో లాక్డౌన్ తప్పదా? సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష!

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (08:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చేయిదాటిపోయేలా కనిపిస్తోంది. దీంతో మళ్లీ లాక్డౌన్ లేదా కఠిన ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు. 
 
ఆ తర్వాత కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా సినిమా థియేటర్లలో సీటింగ్‌ కెపాసిటిని తగ్గించటం, బార్లను మూసివేయడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ శాఖ అధికారులు చెప్పినట్లు సమాచారం. 
 
ముఖ్యంగా, రాత్రి సమయాల్లో జనసంచారంపైనా నియంత్రణ అవసరమని అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో కోవిడ్‌-19 పేషెంట్ల కోసం పడకలను పెంచాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. 
 
కేసులు పెరిగితే ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సమీక్ష సందర్భంగా సూచించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లను రెట్టింపు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆక్సిజన్‌ వృథాను అరికట్టాలని సూచించారు. 
 
కాగా కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న రోగులను చేర్చుకోవద్దని ఆస్పత్రులకు రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు మరో 1250 బెడ్లు కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
వరంగల్‌ ఎంజీఎంలో 150, నిజామాబాద్‌ జీజీహెచ్‌లో 250, మహబూబ్‌నగర్‌ జీజీహెచ్‌లో 150, నల్లగొండ జీజీహెచ్‌లో 150, సూర్యాపేట జీజీహెచ్‌లో 200, ఆదిలాబాద్‌ రిమ్స్‌లో 200, సూర్యాపేట జీజీహెచ్‌లో 200 అదనపు బెడ్లను కేటాయించారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో 9,281 కరోనా బెడ్లు ఉండగా, పెంపుతో ఆ సంఖ్య 10,531కి చేరనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments