Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి మంత్రులను ఇంటికి పంపాల్సిందే : రేణుకా చౌదరి

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (15:19 IST)
ఎన్డీయే ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను ఇంటికి సాగనంపేవరకు పార్లమెంట్ సమావేశాలను సజావుగా సాగనివ్వబోమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రకటించారు. సోమవారం కూడా రాజ్యసభ కార్యక్రమాలకు విపక్ష పార్టీలు ఆటంకం కలిగించడంతో సభాపతి సభను రేపటికి వాయిదా వేసింది. 
 
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకులు రాజీనామా చేసేవరకు పోరాటం ఆగదని, పార్లమెంట్‌ సమావేశాలు జరగనివ్వమన్నారు. గత 10 రోజులుగా సభా కార్యక్రమాలు నిలిచిపోతే ఇప్పుడు చర్చలు చేపట్టడం అర్థరహితమని అధికార పార్టీని విమర్శించారు. 
 
కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌, ఇద్దరు బీజేపీ ముఖ్యమంత్రులు వసుంధర రాజే, శివరాజ్‌ చౌహాన్‌ రాజీనామా చేసి తీరాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేశారు. తమ ప్రాథమిక డిమాండ్లు నెరవేర్చకుండా ఇన్నాళ్లు కాలయాపన చేసి ఇప్పుడు చర్చలకు పిలవడాన్ని రేణుకా చౌదరి తప్పుపట్టారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరగాలంటే ఆ ముగ్గురు రాజీనామా చేయాల్సిందేనని ఆమె తెల్చి చెప్పారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments