Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుతుపవనాల రాక.. జాలర్ల చేతికి చిక్కిన ఎర్ర చందనం చేప!

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (23:27 IST)
రుతుపవనాల రాకతో తెలంగాణలో వర్షాలు పడడంతో.. ఓ 'ఎర్ర చందనం' రకపు చేప బయటకొచ్చి.. జాలర్ల చేతికి చిక్కింది. బుధవారం సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లి గ్రామ చెరువులో.. చేపల వేటకు వెళ్లిన వీరగాని రమేష్‌కు 12 కేజీల బరువున్న ఎరుపు రంగులో కనిపించే అరుదైన 'ఎర్ర చందనం' రకం చేప లభ్యమైంది. ఆ చేపను చూసిన అతను ఎంతో ఆశ్చర్యానికి గురై.. ఆ జిల్లా మత్స్యశాఖకు సమాచారాన్నందించారు. 
 
దీనిపై ఆ జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య మాట్లాడుతూ... ఈ ఎర్రచందనం రకపు చేపలు తెలంగాణ ప్రాంతంలో చాలా అరుదుగా లభిస్తాయని అన్నారు. దీని శాస్త్రీయ నామం హైపోప్తాలమిటిస్‌ అని తెలిపారు.
 
ఒక్క చేపలే కాదు.. రంగు రంగుల కప్పలు నీటిలో తేలియాడుతున్నాయి. బుధవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో.. భారీ వర్షం కురవడంతో... ఖిల్లా వరంగల్‌ కోట పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిలో పసుపుపచ్చ రంగు కప్పలు కనిపించాయి. ఇలాంటి రంగు కప్పలని ఎప్పుడూ చూడని స్థానికులు.. వాటినెంతో ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments